ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని కేంద్రీయ విద్యాలయ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయం నుంచి ఇళ్లకే పరిమితమైన పాఠశాల అధ్యాపకులు ఆరోగ్యం కోసం బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయం నుంచి సుచిత్ర వరకు ర్యాలీ చేపట్టారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ శశింద్రన్ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
కరోనా కారణంగా పూర్తిగా ఇళ్లకే పరిమితమవడం వల్ల ఫిట్నెస్ కోల్పోతున్నామని బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ చంద్రశేఖర్ అన్నారు. ఆరోగ్యంగా ఉండటం కోసం రోజూ వ్యాయామంతో పాటు యోగా చేయాలని సూచించారు. వ్యాయామంతో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. 50 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కాబోయే వరుడి గురించి బయటపెట్టిన రకుల్!