ETV Bharat / state

E Cigarettes Selling Gang Arrest in Hyderabad : హైదరాబాద్​లో ఈ- సిగరేట్ల విక్రయ గ్యాంగ్​ అరెస్ట్​.. దర్యాప్తులో సంచలన విషయాలు..!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2023, 10:29 PM IST

E Cigarettes Sold in Fast Food Centers in Hyderabad
E Cigarettes Gang Arrest at Jubilee Hills in Hyderabad

E Cigarettes Gang Arrest in Hyderabad : హైదరాబాద్ పోలీసుల దాడుల్లో ఈ- సిగరెట్ల విక్రయాలు నిరంతరం బయటపడుతున్నాయి. పాన్ డబ్బాల్లోనే కాకుండా బేకరీలు, ఫాస్ట్​ఫుడ్ సెంటర్లలో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్.. తదితర సామాజిక మాధ్యమాల్లో ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది.

E Cigarettes Gang Arrest in Hyderabad : హైదరాబాద్​లో ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న వ్యక్తులకు బేకరీ షాపులు, కిల్లీ కొట్టులు అడ్డాగా మారాయి. కాలేజ్​ విద్యార్థులు, సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు(Software Employees) కస్టమర్లుగా మలుచుకుని వ్యాపారం సాగిస్తున్నారు. వాటిని అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ-సిగరెట్లు(E-Cigarettes) విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

రాయదుర్గం పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న మాధవ్.. కోల్​కతాకు చెందిన దీపక్, యశ్.. ముంబయికి చెందిన తేజ్​ల నుంచి కొరియర్ ద్వారా ఈ-సిగరెట్లు తెప్పించుకున్నాడు. పంజాగుట్ట, శంకర్ పల్లి, బాచుపల్లి, కొండాపూర్, షేక్​పేట్​లో ఉన్న పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు విక్రయించాడు. 63మంది కళాశాల విద్యార్థులకు మాధవ్ ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో తేలింది.

E-Cigarettes Gang Arrested in Jubilee Hills : పంజాగుట్టలోని ఓ కళాశాలకు చెందిన అచ్యుత్ గౌతమ్.. మాధవ్ నుంచి తక్కువ ధరకు ఈ-సిగరెట్లు కొనుగోలు చేసి వాటిని సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 71మంది సాప్ట్​వేర్ ఉద్యోగులకు అచ్యుత్ గౌతమ్ ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆగష్టు 10వ తేదీన జూబ్లీహిల్స్​లోని రోడ్డు నెం 36లో ఉన్న ఒలంపియా పాన్​షాప్​లో దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి నలుగురిని అదుపులోకి తీసుకుని.. వారి దగ్గర నుంచి రూ.2లక్షలు విలువ చేసే ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముగ్గురు కళాశాల విద్యార్థులున్నారు.

ఈ సిగరెట్లు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం: డీజీపీ

RS.5 Lakh Worth E-Cigarettes Collected by Police : ఆగస్టు 4వ తేదీన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రాయదుర్గంలోని ఓ ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో దాడి చేసి ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలు బ్రాంచీలు ఉన్న ఈ ఫాస్ట్​ఫుడ్ సెంటర్​లో నిషేధిత ఈ-సిగరెట్లు లభించినందున పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-సిగరెట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్స్​కు చెందిన 5గురు విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గత నెల జీడిమెట్లకు చెందిన ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.15లక్షలు విలువ చేసే ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇన్​స్టాగ్రామ్(Instagram)​లో ఆర్డర్ తీసుకొని జీడిమెట్ల నుంచి పంజాగుట్టకు తీసుకొచ్చి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

College Students Addiction E-Cigarettes in Telangana : ఈ-సిగరెట్లను ఎక్కువగా ముంబయి నుంచి హైదరాబాద్​కు సరఫరా అవుతున్నాయి. కొరియర్ లేదా ప్రైవేట్ ట్రాన్స్​పోర్ట్ వాహనాల్లో భాగ్యనగరానికి తీసుకొస్తున్నారు. కిల్లీకొట్లు, హుక్కా పార్లర్లు, బేకరిల్లో వాటికి అడ్డాగా మారాయి. వాటిని కొత్త వాళ్లకు కాకుండా.. తరచూ తీసుకునే కస్టమర్లకు మాత్రమే అమ్ముతున్నారు. కళాశాల విద్యార్థులతో పాటు, సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు వాటిని విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలలకు చెందిన విద్యార్థులు వాటికి బానిసలు అయ్యారని పోలీసులు గుర్తించారు. నానక్​రామ్ గూడలో ఓ బేకరి యజమానిని ఎస్ఓటీ పోలీసులు ఆగస్ట్​లో అరెస్ట్ చేశారు. ఈ-సిగరెట్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఈ-సిగరెట్లు, సిగరెట్ల పట్టివేత

ఈ-సిగరెట్లు కాల్చితే రూ.లక్షల్లో జరిమానా, జైలు శిక్ష!

'ఈ-సిగరెట్లు': సమగ్ర నిషేధమే జాతిహితం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.