ETV Bharat / state

విశాఖ పోర్టు ట్రస్ట్ కొత్త డిప్యూటీ చైర్మన్​గా దుర్గేష్ కుమార్ దూబే

author img

By

Published : Dec 22, 2020, 12:24 PM IST

ఏపీ విశాఖ పోర్టు ట్రస్ట్​కు కొత్త డిప్యూటీ ఛైర్మన్​గా దుర్గేశ్​ కుమార్ దూబే బాధ్యతలు చేపట్టారు. దూబే... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ కొత్త డిప్యూటీ చైర్మన్​గా దుర్గేష్ కుమార్ దూబే
విశాఖ పోర్టు ట్రస్ట్ కొత్త డిప్యూటీ చైర్మన్​గా దుర్గేష్ కుమార్ దూబే

ఏపీ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్​ కొత్త డిప్యూటీ ఛైర్మన్​గా దుర్గేష్ కుమార్ దూబే బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్ భారతీయ రైల్వేస్ ట్రాఫిక్ విభాగపు అధికారి అయిన దూబే.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

2008-2011 మధ్య బిలాస్​పూర్​లో డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ గానూ, 2011-13 మధ్య ప్రయాగ్ రాజ్​లో ప్రాంతీయ కార్యనిర్వహణ అధికారిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2014-17లో ఝాన్సీలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్​గా పని చేశారు. పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించటానికి ముందు ఆయన ఉత్తర మధ్య రైల్వే పరిధిలోని ప్రయాగ్ రాజ్​లో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్​గా సేవలందించారు.

ఇదీ చదవండి: 'కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు మేలే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.