ETV Bharat / state

DGP Mahender Reddy : రాష్ట్రంలో 4.65 శాతం నేరాలు పెరిగాయి: డీజీపీ

author img

By

Published : Dec 31, 2021, 1:02 PM IST

Updated : Dec 31, 2021, 4:21 PM IST

DGP Mahender Reddy : ఈ ఏడాదిలో 4.65 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని... మావోయిస్టుల రాకపోకలను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేశామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పోలీస్‌శాఖ పనిచేస్తోందని వెల్లడించారు.

DGP Mahender Reddy, police annual report
పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2021

DGP Mahender Reddy : గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో 4.6శాతం నేరాలు పెరిగాయని... డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీస్ వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేసిన ఆయన... శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ సఫలీకృతమైందని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రజలకు అండగా ఉంటూ, బాధ్యతాయుతంగా నిలిచారని అభినందించారు. మావోయిస్టు రహిత రాష్ట్రంలా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని... సమర్థవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. మత ఘర్షణలు లేకుండా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారన్న డీజీపీ...సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. నగరాల్లో 5 నిమిషాల్లో సంఘటనాస్థలాలకు చేరుకోవడంతోపాటు... షీ టీమ్స్‌ ద్వారా మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో సఫలీకృతమైంది. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్‌శాఖ పనిచేస్తోంది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు పోలీస్‌శాఖ పనిచేస్తోంది. గతేడాదితో పోలిస్తే 4.65 శాతం నేరాలు పెరిగాయి. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్‌శాఖ పనిచేస్తోంది. 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభించాం.

-మహేందర్ రెడ్డి, డీజీపీ

మత ఘర్షణల రహిత రాష్ట్రంగా..

మత ఘర్షణలు లేకుండా నిరంతరం పని చేస్తున్నామన్న డీజీపీ... ఏడేళ్లుగా ఎలాంటి మత ఘర్షణలు జరగలేదని తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయిని అన్నారు. 98 మావోయిస్టులను అరెస్టు చేశామని... 133 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. 50.3 శాతం కేసుల్లో నేరగాళ్లకు శిక్షలు పడ్డాయని.. 80 కేసులో 126 మందికి జీవిత ఖైదు పడిందని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదుల స్వీకరిస్తున్నాం. డయల్ 100కి 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్నారు. 800 పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ప్రారంభించాం. షీ టీమ్స్‌ 5,145 ఫిర్యాదులు స్వీకరించి భరోసా కల్పించాయి. హాక్‌ఐ ద్వారా 83 వేలకుపైగా ఫిర్యాదులు స్వీకరించాం. 664 మంది నేరగాళ్లపై పీడీ చట్టం నమోదు చేశాం.

-మహేందర్ రెడ్డి, డీజీపీ

పోలీసులకు జాతీయ అవార్డులు

రాష్ట్రంలో 8.5 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఉన్నాయన్న డీజీపీ... నిఘా నేత్రాల ద్వారా కీలక ఆధారాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదయ్యాయని... రహదారి ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారని వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై రూ.879 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక డేటా బేస్ ఉందని... ప్రత్యేక డేటా బేస్ ద్వారా 25 వేల కేసులు ఛేదించామని వివరించారు. ఈ ఏడాది రాష్ట్ర పోలీసులకు 11 జాతీయ అవార్డులు వచ్చాయని తెలిపారు.

పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2021

ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated : Dec 31, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.