ETV Bharat / state

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం : డీజీపీ

author img

By

Published : Jan 25, 2021, 1:48 PM IST

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: డీజీపీ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: డీజీపీ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సీసీ కెమెరాలను డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని పేర్కొన్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. మాదాపూర్ జోన్‌లో 2 వేల 58 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

కెమెరాతో అనుసంధానమైన 3 వాహనాలు ప్రారంభించిన డీజీపీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లక్షా 26 వేల కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కమ్యూనిటీ సీసీ కెమెరాలు 18 వేల 487, నేను సైతం సీసీ కెమెరాలు 1 లక్ష 8 వేలు ఏర్పాటు చేశారని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.