ETV Bharat / state

పైస లేనిదే పని జరగడం లేదు

author img

By

Published : Aug 27, 2019, 5:02 AM IST

Updated : Aug 27, 2019, 7:33 AM IST

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అద్బుతమైన ఫలితాలు సాధించవచ్చని.... సమాజంలోనూ మంచి మార్పు వస్తుందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అన్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో పదమూడో అవే జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సదస్సుకు హాజరైన ప్రముఖులు

హైదరాబాద్​ రవీంద్రభారతిలో పదమూడో అవే జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిపుర మాజీ సీఎం మాణిక్​ సర్కార్​, లోక్​సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్​ నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మండలి బుద్ధ ప్రసాద్​, పరకాల ప్రభాకర్​ హాజరయ్యారు. దేశంలో 65 శాతం ప్రజలు ఏదో ఒక పని కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదని వారు ఆరోపించారు. ఎక్కడ అవినీతి జరిగితే అవినీతికి పాల్పడిన వ్యక్తిని సిగ్గుపడేలా చేయాలని నేతలు పిలుపినిచ్చారు. ఆదర్శమూర్తులను నిత్యం సమాజంలో గౌరవించబడేలా చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నిజాయతీగా పని చేసిన 11 మందికి అవార్డులు ప్రదానం చేశారు.

పైస లేనిదే పని జరగడం లేదు

ఇదీ చూడండి: విద్యుత్​ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధంకండి: లక్ష్మణ్

sample description
Last Updated : Aug 27, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.