ETV Bharat / state

cpm: 'రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

author img

By

Published : Jun 11, 2021, 7:32 PM IST

tammineni veerabhadram
cpm: 'రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ఆస్తులు, భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం(cpm) పేర్కొంది. నిన్న ప్రకటించిన జీవో నంబర్‌ 13ను ఉపసంహరించాలని కోరింది. భవిష్యత్‌ తరాలకు భూములు, ఆస్తులు లేకుండా చేయడం ప్రజా పరిపాలన అనిపించుకోదని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(tammineni veerabhadram) ఎద్దేవా చేశారు. తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకుని… ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.

రాష్ట్ర ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం ప్రకటించి, జీవో నంబర్‌ 13ను ఉపసంహరించాలని సీపీఎం(cpm) డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 13ను విడుదల చేయడాన్ని సీపీఎం(cpm) రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలు విక్రయించాలని నిర్ణయించడం సరైంది కాదని… సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(tammineni veerabhadram) పేర్కొన్నారు. భవిష్యత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా విడుదల చేసిన… ఆ జీవోను తక్షణమే ఉప సంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో పేద రైతుల భూములను చౌకగా సేకరిస్తుందన్నారు. గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను కూడా… ప్రభుత్వ అవసరాలకు తీసుకుందన్నారు. ఇప్పుడున్న లోటు బడ్జెట్‌ను పూడ్చుకోవడానికి భూములు అమ్మటం అంటే రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా… బాధ్యత రహితంగా వ్యవహరించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Arrest: అనుమతి లేకుండా విత్తనాల వ్యాపారం, రూ.17లక్షల సరుకు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.