ETV Bharat / state

'మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ఎంతో సురక్షితం'

author img

By

Published : Jan 25, 2021, 12:35 PM IST

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. మన దేశంలో తయారైన ఈ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేశారు.

corona-vaccination-program-in-aig-hospital-at-gachibowli-in-hyderabad
'మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ఎంతో సురక్షితం'

మన దేశంలో తయారైన కొవిడ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని హైదరాబాద్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్​వో స్వరాజ్యం లక్ష్మి హాజరయ్యారు.

ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. రోజుకి రెండు వందల నుంచి 500 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: ప్రేమోన్మాదం పెచ్చుమీరుతోంది... కపట నాటకంతో కత్తిదూస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.