ETV Bharat / state

వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

author img

By

Published : Jul 22, 2020, 7:52 AM IST

Updated : Jul 22, 2020, 9:06 AM IST

corona-positive-to-mp vijayasai-reddy
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్

వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 10 నుంచి 15 రోజుల వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, వైకాపా పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా... వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

మంగళవారం సాయంత్రం తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. చికిత్స కోసం హైదరాబాద్​లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 10 రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...విద్యార్థుల్లో 'లెర్న్​ టు ఎర్న్'​కు నాంది పడాలి: సీఎం జగన్

Last Updated :Jul 22, 2020, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.