ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు

author img

By

Published : Dec 9, 2020, 12:27 PM IST

రాష్ట్రంలో మరో 721 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 2,75,261మందికి చేరింది. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు.

corona new cases in telangana state
రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 721 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,75,261మందికి చేరింది. మహమ్మారి కాటుతో మరో ముగ్గురు మృతి చెందగా... మరణించిన వారి సంఖ్య 1,480 మందికి చేరింది. తాజాగా మరో 753 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,66,120 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 7,661 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 5,576 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: సవరణలకు ఓకే- చట్టాల రద్దుకు సర్కార్​ ససేమిరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.