ETV Bharat / state

'కరోనా వైరస్​ పట్ల భయాందోళనలు అవసరం లేదు'

author img

By

Published : Jul 12, 2020, 5:53 PM IST

కరోనా.. అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని ఏపీలోని పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య అభిప్రాయపడ్డారు. వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్​లో ఉన్న ఆయన.. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు.

corona is not a big disease to worry about says ycp mla
'కరోనా వైరస్​ పట్ల భయాందోళనలు అవసరం లేదు'

'కరోనా వైరస్​ పట్ల భయాందోళనలు అవసరం లేదు'

కరోనా వైరస్ పట్ల ఎవరూ ఆందోళనకు గురికానవసరం లేదని ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య తెలిపారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నారు. తన సందేశాన్ని వీడియో రూపంలో పంపించారు. కరోనా.. అందరూ ఆందోళన చెందేటంత పెద్ద వ్యాధి కాదని... వైరస్ సోకిన వారి పట్ల వివక్ష మానుకోవాలని సూచించారు.

వైరస్ బాధితుల్లో 98 శాతం మంది కోలుకుంటున్నారని... ప్రత్యేకమైన సమస్యలున్న 2 శాతం మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, వైద్య చికిత్సలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే రోశయ్య అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.