ETV Bharat / state

ts corona cases: రాష్ట్రంలో కొత్తగా 494 మందికి పాజిటివ్

author img

By

Published : Aug 10, 2021, 9:40 PM IST

రాష్ట్రంలో కొత్తగా 494 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​ బారినపడి మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 8,112 యాక్టివ్​ కేసులున్నాయి.

ts corona cases: రాష్ట్రంలో కొత్తగా 494 మందికి పాజిటివ్
ts corona cases: రాష్ట్రంలో కొత్తగా 494 మందికి పాజిటివ్

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 89,037 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 494 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,50,353కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,831కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 621 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,38,410కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,112 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి: 'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రం నుంచే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.