ETV Bharat / state

ఆ 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు

author img

By

Published : Jan 6, 2023, 10:24 AM IST

Updated : Jan 6, 2023, 2:00 PM IST

congress
కాంగ్రెస్‌

10:20 January 06

బీఆర్​ఎస్​లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

Congress complaint on 12 BRS MLAs : ఓవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు దృష్టి సారించింది. గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ నుంచి బీఆర్​ఎస్​లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, రామ్మోహన్ రెడ్డి, సంపత్ కుమార్ , గడ్డం ప్రసాద్, మల్లు రవి కలిసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్​కు చేరుకుని కాంగ్రెస్‌ నుంచి బీఆర్​ఎస్​లోకిచేరిన 12 మంది ఎమ్మెల్యేలపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్​ఎస్​లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 6, 2023, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.