ETV Bharat / state

పార్లమెంట్ ఎన్నికల్లో 12సీట్లకు తగ్గొద్దన్న రేవంత్ రెడ్డి, ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 6:12 PM IST

Updated : Jan 8, 2024, 9:43 PM IST

Congress Meeting On MP Elections
పార్లమెంట్​ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సమీక్ష - ఆయా నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం

Congress Meeting On MP elections : రానున్న పార్లమెంట్​ ఎన్నికలపై కాంగ్రెస్​ దృష్టి సారించింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఎంసీహెచ్‌ఆర్‌డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నేతలతో చర్చించారు. రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకునేట్లు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీం సూచించారు. ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు రేవంత్‌రెడ్డి వెళ్లాలని నిర్ణయించారు.

Congress Meeting On MP Elections : త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షులు హోదాలో ఇవాళ, రేపు రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఏర్పాటు చేశారు. ఇవాళ ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్​సభ స్థానాలల్లో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకునేట్లు కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీం సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్​ఛార్జీలు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌కు ఇన్​ఛార్జిగా (Adilabad Incharge) మంత్రి సీతక్క, నిజామాబాద్​ జూపల్లి కృష్ణారావు, మెదక్​ కొండా సురేఖ, మహబూబ్‌నగర్ దామోదర రాజనర్సింహ, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ ఇన్​ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు.

CM Revanth Reddy Meeting on Parliament Elections : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో పాటు సమీక్షా సమావేశంలో వీరు కూడా పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాల వారీగా వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఆయా నియోజకవర్గాల తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. బీఆర్​ఎస్​, బీజేపీ కాంగ్రెస్ పార్టీల బలాబలాలను నాయకులతో అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. జరగనున్న పార్లమెంట్​ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు.

ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి తొలి సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి సభలో సీఎం పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని కూడా ప్రకటించారు.
జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని కూడా సీఎం తెలిపారు.

కాళేశ్వరం న్యాయవిచారణ ఆపేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ ఏకమవుతున్నాయి : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

Minister Seethakka about Adilabad : పార్లమెంట్​ ఎన్నికలపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా గత పాలనలో అభివృద్దికి ఆమడదూరంలో ఉందని, మిగతా ప్రాంతాలకు దీటుగా ఆదిలాబాద్‌ను అభివృద్ది చేస్తామని టీపీసీసీ చీఫ్(TPCC Chief Revanth Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మంత్రి సీతక్క వెల్లడించారు.

ఎంసీహెచ్‌ఆర్‌డీ(MCHRD) ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, ఇతర ప్రజా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జనవరి 26 తర్వాత మొదటి పర్యటనగా ఇంద్రవెల్లికి సీఎం వస్తారని పేర్కొన్నారు. గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల వారీగా అభివృద్ది ఎజెండాను తయారు చేసుకోవాలని సీఎం సూచించారన్నారు.

Seethakka on BRS Leaders : బీఆర్​ఎస్​ నేతలు పదవులు లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఆటో కార్మికులను బీఆర్​ఎస్​ నాయకులు రెచ్చగొడుతున్నారని, మహిళలు ఉచితంగా బస్​లలో ప్రయాణం చేయడం వాళ్లకు నచ్చడం లేదంటూ నిలదీశారు. తర్వాత విడతలో మహిళలకు 2500 రూపాయలు, గ్యాస్ సిలిండర్​ కోసం రూ. 500, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్​ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని సీతక్క వివరించారు.

లోక్​సభ స్థానాలకు ఇంఛార్జీలను నియమించిన బీజేపీ - 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు

ఐదు పథకాల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ, ఛైర్మన్​గా భట్టి

Last Updated :Jan 8, 2024, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.