నల్గొండ మున్సిపాలిటీని కోల్పోయిన బీఆర్​ఎస్​ - అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్​

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 6:49 PM IST

thumbnail

No Confidence Motion in Nalgonda : నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంతో హస్తగతం చేసుకుంది. బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన మున్సిపల్​ ఛైర్మన్​ మందాడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ జిల్లా కలెక్టర్​ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్​లో కాంగ్రెస్ పార్టీకి 41 మంది అనుకూలంగా ఓటు వేయగా, బీఆర్​ఎస్​కు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు. ఫలితంగా బీఆర్​ఎస్​ పార్టీ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని కోల్పోయింది.

No Confidence Motion on BRS Municipal Chairman : అవిశ్వాస తీర్మానం ఓటింగ్​లో 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ తటస్థంగా ఉండగా, బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. నల్గొండ మున్సిపల్​లో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్​ 19, బీఆర్ఎస్​​ 21, బీజేపీ 6, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచినా విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్​ఎస్​ నుంచి పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీలోకి చేరారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.