ETV Bharat / state

మంత్రి కేటీఆర్​పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

author img

By

Published : Mar 9, 2021, 6:21 PM IST

మంత్రి కేటీఆర్​పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
మంత్రి కేటీఆర్​పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

మంత్రి కేటీఆర్​పై కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మండలి ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.

మంత్రి కేటీఆర్​పై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్​ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మండలి ఎన్నికల ప్రచారంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని... ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-హైద‌రాబాద్‌-రంగారెడ్డి, ఖ‌మ్మం-న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్ మండ‌లి ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క వ‌ర్గాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా వివిధ విద్యాసంస్థలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల‌తో సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మసీ క‌ళాశాల‌లో స‌మావేశ‌మై తెరాస అభ్యర్థుల‌కు అనుకూలంగా ప్రచారం చేశార‌ని ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్‌లు జ‌త చేసి పంపుతున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందున మంత్రితో పాటు ఆయా సంస్థల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.