ETV Bharat / state

Sirpurkar Commission: 'వాంగ్మూలం విషయంలో ఎన్​హెచ్​ఆర్సీ బృందం భయపెట్టింది': సురేందర్​

author img

By

Published : Oct 22, 2021, 10:29 PM IST

Sirpurkar Commission: 'వాంగ్మూలం విషయంలో ఎన్​హెచ్​ఆర్సీ బృందం భయపెట్టింది': సురేందర్​
Sirpurkar Commission: 'వాంగ్మూలం విషయంలో ఎన్​హెచ్​ఆర్సీ బృందం భయపెట్టింది': సురేందర్​

దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో షాద్​నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ను సిర్పూర్కర్ కమిషన్ వరుసగా రెండో రోజు ప్రశ్నించింది. ఎన్ కౌంటర్​కు సంబంధించిన వాంగ్మూలం విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం.. తనను భయపెట్టిందని ఏసీపీ సురేందర్, సిర్పూర్కర్ కమిషన్​కు వివరించారు. తాను చెప్పిన విషయాలు కాకుండా ఎన్​హెచ్​ఆర్సీ బృందం సభ్యులు.. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని తెలిపారు.

దిశ నిందితుల ఎన్​కౌంటర్​కు సంబంధించిన వాంగ్మూలం విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం.. తనను భయపెట్టిందని ఏసీపీ సురేందర్, సిర్పూర్కర్ కమిషన్​కు వివరించారు. తాను చెప్పిన విషయాలు కాకుండా ఎన్​హెచ్​ఆర్సీ బృందం సభ్యులు.. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే.. సస్పెండ్ చేయిస్తామని బెదిరించారని ఏసీపీ సురేందర్ కమిషన్ ఎదుట తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా తనను ప్రశ్నించారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో షాద్​నగర్ ఏసీపీగా ఉన్న సురేందర్​ను సిర్పూర్కర్ కమిషన్ వరుసగా రెండో రోజు ప్రశ్నించింది.

ఏసీపీ సురేందర్ ఇచ్చిన అఫిడవిట్​లో, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికలో అంశాలు పరస్పరం భిన్నంగా ఉన్న విషయాన్ని కమిషన్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. తన ప్రమేయం లేకుండానే ఎన్​హెచ్ఆర్సీ బృంద సభ్యులు రాసుకున్నారని సురేందర్ తెలిపారు. దాదాపు 28ఏళ్లపాటు పోలీసు సర్వీసులో ఉన్న మీరు.. ఎన్​హెచ్ఆర్సీ బెదిరింపులను ఎవరి దృష్టికి తీసుకెళ్లలేదా అని కమిషన్ ప్రశ్నించగా... ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలనే ఉద్దేశంతోనే శంషాబాద్ డీసీపీకి తప్పితే మిగతా ఎవరికీ చెప్పలేదని సురేందర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్​కౌంటర్ జరిగిన సమయంలో సురేందర్ షాద్​నగర్ ఏసీపీగా ఉన్నారు. రెండు కేసులకు దర్యాప్తు అధికారిగా కూడా వ్యవహరించారు. సురేందర్ ఇచ్చిన అఫిడవిట్​లోనూ పలు అంశాలను ప్రస్తావిస్తూ.. కమిషన్ ఆయనను విచారిస్తోంది. రేపు కూడా ఏసీపీ సురేందర్​ను కమిషన్ విచారించనుంది.

సంచలనం సృష్టించిన ఘటన

2019, నవంబర్​ 27న జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షాద్​నగర్​ ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌కు 50మీటర్ల దూరంలో అత్యాచారం చేసిన నిందితులు అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని వారి లారీలో షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్‌ పోసి నిప్పంటించారు. నిందితులను 2019, డిసెంబర్​ 6న తెల్లవారుజామున పోలీసుల ఎన్​కౌంటర్​ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ (Scene Reconstruction) చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు (Encounter) జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ (Encounter)లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్​కౌంటర్ (Encounter) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్​కౌంటర్(Encounter) ఘటనపై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది.

త్రిసభ్య కమిషన్​ విచారణ

ఫిబ్రవరి 3న దిశ ఎన్​కౌంటర్​పై త్రిసభ్య కమిషన్​ విచారణ ప్రారంభించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఆర్నెళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు... సిర్పూర్కర్ కమిషన్​ను ఆదేశించడంతో ఆ మేరకు విచారణ కొనసాగుతోంది. దిశ కుటుంబ సభ్యులు, ఎన్​కౌంటర్​లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులతో పాటు... పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నివేదికను తీసుకుంది. వారితో ఉన్నతాధికారులను, సిట్​ ఛైర్మన్​లను కూడా విచారించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.