ETV Bharat / state

రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష - '2024-25 బడ్జెట్​లో వాస్తవాలు ప్రతిబింబించాలి'

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2023, 10:34 PM IST

CM Revanth Reddy on Budget 2024-25 : రాష్ట్ర ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధికారులతో సమీక్ష నిర్వహించారు. 2024-25 వార్షిక బడ్జెట్ వాస్తవికతను ప్రతిబింబించేలా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్​ రూపొందించాలని వారికి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్​రెడ్డి సమీక్ష
CM Revanth Reddy on Budget

CM Revanth Reddy on Budget : రాష్ట్ర ఆదాయ, వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా వచ్చే సంవత్సరానికి బడ్జెట్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలను, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెబుదామని సీఎం దిశానిర్దేశం చేశారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని ఆధికారులను సూచించారు. వృథా ఖర్చులు తగ్గించాలని చెప్పారు.

సచివాలయంలో(Secretariat) సీఎం రేవంత్​రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగుల జీతభత్యాలు, హామీల అమలుకు ఖర్చు ఎంతనే అంచనాలు పక్కాగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని తెలిపారు. దాపరికం లేకుండా ఆదాయ, వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు.

'తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం - విభజన చట్టంలో రావాల్సిన హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది'

CM Revanth Reddy about Financial Budget : కొందరు వ్యక్తులను సంతృప్తిపరచాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అధికారులకు సీఎం గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. గతంలో మాదిరిగా అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను(expenses) భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

తప్పనిసరైతేనే ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇవ్వాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడున్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను(Grants) రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, పథకాల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్​ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.

CM Revanth Reddy about Economic Situation : రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని సీఎం రేవంత్​రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. దాని వల్ల కేంద్రానికి పేరు వస్తుందనో లేక, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు రాదనో బేషజాలకు పోవద్దన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి టి.కె.శ్రీదేవి, సంయుక్త కార్యదర్శి కె.హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు.

వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్‌ రెడ్డి

రేపటి నుంచే ఐదు పథకాలకు దరఖాస్తు స్వీకరణ - రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.