ETV Bharat / state

సత్తెనపల్లి​లో ఉద్రిక్తత... కుర్చీలు విసురుకున్న నేతలు

author img

By

Published : Nov 10, 2022, 7:44 PM IST

Clash Between Two TDP Factions
Clash Between Two TDP Factions

Clash Between Two TDP Factions: ఏపీలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని తెదేపాలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీకి చెందిన నేతలు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్​ విషయంలో ఏదోఒకటి తేల్చాలని ఇరు వర్గాలు డిమాండ్‌ చేశారు.

Clash Between Two TDP Factions: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సత్తెనపల్లి పార్టీ సంస్థాగత కమిటీల నియామకం కోసం తెదేపా నేతలు నక్కా ఆనంద బాబు, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, డోలా బాలావీరాంజనేయ స్వామి,.. నియోజకవర్గ పరిశీలకులు గన్నే వెంకట నారాయణ ప్రసాద్​లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. దీంతో పార్టీ సంస్థాగత నియామకాలు రసాభాసగా మారాయి. వేరే నియోజకవర్గ తెదేపా నాయకులు ఈ నియామక కార్యక్రమానికి ఎలా వచ్చారని కోడెల వర్గం ఆరోపించింది. స్థానిక నియోజకవర్గం నేతల పెత్తనమే ఇక్కడ కొనసాగాలని జీవీ ఆంజనేయులు వద్ద కోడెల శివరాం డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కమిటీ సమావేశం నుంచి మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వెళ్లిపోయారు.

సత్తెనపల్లి​లో ఉద్రిక్తత... కుర్చీలు విసురుకున్న నేతలు

ఇవీ చదవండి: సంబంధం లేకపోతే దర్యాప్తు ఎందుకు ఆపాలంటున్నారు: హరీశ్‌రావు

దేవుడి దర్శనం కోసం 2 కిలోమీటర్లు నడిచిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.