ETV Bharat / state

ముందస్తు చర్యలు చేపడుతున్నాం: చార్మినార్ జోనల్ కమిషనర్​

author img

By

Published : May 26, 2021, 6:21 PM IST

రానున్న వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చార్మినార్​ జోనల్​ కమిషనర్​ నామ సామ్రాట్​ అశోక్​ అన్నారు. బుధవారం పత్తర్​ గట్టి, ఉప్పుగూడ కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్​వోలతో కలసి పలు ప్రాంతాల్లో పర్యటించారు.

ముందస్తు చర్యలు చేపడతున్నాం: చార్మినార్ జోనల్ కమిషనర్​
ముందస్తు చర్యలు చేపడతున్నాం: చార్మినార్ జోనల్ కమిషనర్​

చార్మినార్​ జోనల్​ కమిషనర్​ నామ సామ్రాట్​ అశోక్.. జోనల్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రానున్న వర్షాకాలంలో వరద నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నాలాలు, డ్రైనేజీ మ్యాన్​హోళ్లలో పూడికతీత చేపడతామని తెలిపారు. పంజేషా, మీరాలం మండి, పురాని హవేలి, బాబానగర్​, చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్, రాజేంద్రనగర్ సర్కిల్​లోని శాస్త్రిపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్, పార్కులు, బస్తీ దవాఖానాలను పరిశీలించారు.

ప్రతిరోజు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వ్సాక్సిన్ పంపిణి చేయనున్నామని తెలిపారు. మలక్​పేట్ ముంతాజ్ కాలేజ్, గౌలిపురా మిత్ర క్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, రెయిన్​బజార్ ఎస్​ఆర్​టీ కాలనీ ప్లే గ్రౌండ్, చాంద్రాయణగుట్ట సుహానా ఫంక్షన్ హాల్, చార్మినార్ సర్దార్ మహల్ సనా గార్డెన్, బహదూర్ ​పుర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, శివరాంపల్లిలోని ఎస్ఎన్​సీ కాన్వేషన్ హాల్​లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. ​కమిషనర్​తో పాటు పత్తర్​ గట్టి, ఉప్పుగూడ కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్​వోలు ఉన్నారు.

ఇదీ చదవండి: 'మానుకోట తిరుగుబాటు.. సమైక్యాంధ్రుల మీద సాధించిన గొప్ప విజయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.