ETV Bharat / state

'తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు, కానుకలు అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపండి'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 10:51 PM IST

Central Election Commission on Assembly Elections : ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు, వివిధ కానుకలను.. నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఆదేశాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ ఇచ్చారు.

Central Election Commission Review Meeting
Central Election Commission Review Meeting

Central Election Commission on Assembly Elections : ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు, వివిధ కానుకల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కీలక నిర్ణయం తీసుకొంది. స్వాధీనం చేసుకుంటున్న నగదు, కానుకలు, వస్తువుల ధరను లెక్కగట్టి నామినేషన్ల ఖరారు తర్వాత ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్​ను ఆదేశించింది. ఇదే సమయంలో తగిన సాక్ష్యాలు ఉంటే పట్టుబడుతున్న నగదును వదిలిపెట్టాలని(EC Seized Money) సూచించింది.

ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్​ కుమార్ వ్యాస్, ముఖ్యకార్యదర్శి అవినాశ్​ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. సీఈఓతో పాటు ఇతర అధికారులు, ఎన్​ఫోర్స్ మెంట్ ఏజెన్సీస్, నోడల్ అధికారులతో సమావేశమై ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు.

Final Voter List Released in Telangana : 3,17,17,389 ఓటర్లతో తుది జాబితా రెడీ..

Telangana Assembly Election 2023 : అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తరలింపు అడ్డుకునేందుకు సాంప్రదాయ పద్దతులు కాకుండా ఆధునికంగా ఆలోచించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సూచించారు. ఓటర్ల జాబితా తుది సవరణల తరువాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఓటరు కార్డుల పంపిణీ, ఓటర్ల సమాచార స్లిప్‌ల విషయంలో తాజా పరిస్థితి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ ధృవపత్రాలను రోజువారీగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

హోంఓటింగ్ కోసం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశిత ఫారాలను ముందే అందించాలని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు భద్రతా బలగాల తనిఖీల్లో రూ.427.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. గడిచిన 24 గంటల్లో రూ.14.53 కోట్లను స్వాధీనం చేసుకొని.. ఇంకా తనిఖీలను ముమ్మరం చేశారు.

Election Commission on Returning Seized Money Telangana : రాష్ట్రంలోని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న నగదులో రాజకీయ పార్టీలకు, ఎన్నికలకు సంబంధం లేదని తెలిస్తే.. ఆ నగదును సదరు యజమానికి వెంటనే తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు కేంద్ర ఎన్నికల కమిషన్​ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంపై వారికి అనేక ఫిర్యాదులు అందాయి. తనిఖీల సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇక త్వరలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో.. భారీగా బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అసలు రాజీపడొద్దని తెలిపారు. నవంబరు 30వ తేదీన పోలింగ్​ పూర్తయిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్లను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్​ రూంలకు తరలించే ఏర్పాటు చేయాలని సూచించారు.

Vote from Home in Telangana Elections 2023 : వారందరికీ గుడ్​న్యూస్​.. ఇక ఇంటి నుంచే ఓటు వేసుకునే ఛాన్స్​..

EC Orders To Return Seized Money : 'మీ సొత్తును పోలీసులు సీజ్ చేశారా.. టెన్షన్ వద్దు.. మీ డబ్బు మీ వద్దకు వచ్చేస్తుందిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.