ETV Bharat / state

వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ

author img

By

Published : Sep 12, 2020, 8:16 PM IST

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న... వివేకా హత్య కేసులో రెండో విడత విచారణ చేపట్టింది సీబీఐ. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది.

వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ
వివేకా హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు.

జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత ఏపీకి వచ్చిన అధికారులు... శనివారం పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.