ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

author img

By

Published : Sep 3, 2019, 9:11 PM IST

Updated : Sep 3, 2019, 9:20 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబు బ్లాస్ట్ చేయబోతున్నట్లు ఓ ఆగంతకుడు మెయిల్​ పంపి బెదిరించారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేశారు.

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్​ రావటం వల్ల ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్‌పోర్టులో బాంబు బ్లాస్ట్‌ చేయబోతున్నానంటూ అధికారులకు సాయిరాం కాలేరు అనే మెయిల్ ఐడీతో సందేశం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు. బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మెయిల్​ ​ చేసిన ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీచూడండి: 'కేసీఆర్​ ఫామ్​హౌస్​ నుంచి బయటకు రావాలి'

TG_HYD_39_30_OFFICIAL_SPOKES_NIRANJAN_AV_3038066 Reporter: Tirupal Reddy Dry () పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైతే హైదరాబాద్ భూములమ్మి నిధులు సమకూర్చుకుంటామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. భూములు అమ్మడానికి హైదరాబాద్ ఏమైనా కేసీఆర్‌ జాగీరా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్‌ నిలదీశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ను చేయాలని అప్పట్లో ప్రతిపాదన ఉన్నా....కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాకే ఉండాలని పట్టుబట్టి సాధించిందని ఆయన గుర్తు చేశారు. నగరంలోని చారిత్రక కట్టడాలను ఓ వైపు కూల్చివేస్తూ... మరోవైపు విలువైన భూములను అమ్ముతూ హైదరాబాద్‌కు చరిత్ర లేకుండా చేస్తున్నారని ద్వజమెత్తారు. తెలంగాణలో 45 శాతం ఆదాయం ఒక్క హైదరాబాద్ ద్వారానే వస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ద్వజమెత్తారు. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు లేవుకాని...పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రం హైదరాబాద్ భూములు అమ్మి ఇస్తారా అని నిలదీశారు. భూములు అమ్మి కాకుండా ఇతర వనరుల ద్వారా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేసిన ఆయన ఈ విషయంలో కేసీఆర్ విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బైట్: నిరంజన్‌, పీసీసీ అధికార ప్రతినిధి
Last Updated : Sep 3, 2019, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.