ETV Bharat / state

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 10:36 AM IST

Updated : Oct 26, 2023, 11:20 AM IST

BJP Janasena Alliance in Telangana : తెలంగాణలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు పొడిచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌కు భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించినట్లు తెలుస్తోంది. శుక్రవారం తన హైదరాబాద్‌ పర్యటనలోపు సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీలు ప్రాథమిక అంచనాకు రాగా.. జనసేన 33 సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

BJP and Janasena Alliance in Telangana
BJP and Janasena Alliance in Telangana

BJP and Janasena Alliance in Telangana తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పనిచేయండి

BJP Janasena Alliance in Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీల నేతలు బుధవారం సాయంత్రం అమిత్‌ షాను కలిసి సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు.

Amit shah Advice To Kishan reddy and Pawan Kalyan : విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాను శుక్రవారం హైదరాబాద్‌కు వస్తున్నానని, ఆలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌ షా సూచించినట్లు తెలిసింది. అందుకు కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌ అంగీకరించారు. అంతర్గతంగా పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలని అనుకుంటున్నది చెబుతామని వారు చెప్పినట్లు సమాచారం. జనసేన నాయకులు ఉమ్మడి హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 33 సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.

BJPs Firebrand Leaders Contesting from Joint Karimnagar : ఒకే ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఫైర్​ బ్రాండ్​ నేతల పోటీ.. బీజేపీ ప్లాన్​ వర్కౌట్​ అయ్యేనా..?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో.. కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లు భేటీ కావాలనుకున్నా ఆయన మరో సమావేశంలో ఉండటంతో కలవలేకపోయారు. గతంలో పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) హైదరాబాద్‌లో ప్రాథమికంగా చర్చించామని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుదామని ఆయన అనడం వల్లే ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి అని.. అంతవరకే తమ చర్చలు ఉంటాయని కిషన్‌రెడ్డి వివరించారు.

Telangana BJP MLA Candidates First List 2023 : హుజూరాబాద్​, గజ్వేల్​ నుంచి ఈటల.. గోషామహల్​ నుంచి రాజాసింగ్.. బీజేపీ తొలి జాబితా విడుదల​

Telangana Assembly Elections 2023 : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు కిషన్‌రెడ్డి (Kishan reddy) వివరించారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. నవంబరు 1న కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి రెండో జాబితాను విడుదల చేస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

"హైదరాబాద్‌లో ప్రాథమికంగా కలిశాం. కాసేపు ఇద్దరూ చర్చించాం. పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడుదామని ఆయన అనడం వల్లే ఆహ్వానించాం. జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతవరకే మా చర్చలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఈ సమావేశంలో అమిత్‌ షా, పవన్‌ కల్యాణ్‌లు ప్రత్యేకంగా ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హోంమంత్రికి పవన్‌ కల్యాణ్‌ వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని, కష్టపడి పనిచేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో జనసేన కలిసి వెళ్తున్న విషయం అమిత్‌ షా వద్ద చర్చకు రాలేదని.. తెలంగాణలో కలిసి పనిచేసే విషయం మాత్రమే చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Kishan Reddy Meet Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల ప్రచారాలు.. ఇంటింటికి వెళ్తూ.. ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు

Last Updated : Oct 26, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.