ETV Bharat / state

వంతెన విస్తరణ పనులను పరిశీలించిన తలసాని

author img

By

Published : May 15, 2021, 5:15 PM IST

వంతెన విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి
వంతెన విస్తరణ పనులు పరిశీలించిన మంత్రి

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ​రాంగోపాల్​పేట డివిజన్ లోని నాలాపై చేపట్టిన వంతెన విస్తరణ పనులను పరిశీలించారు. లాక్​డౌన్​లో ట్రాఫిక్​ రద్దీ తక్కువగా ఉంటుందని.. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

హైదరాబాద్​ రాంగోపాల్​పేట డివిజన్​లోని నాలాపై వంతెన విస్తరణ పనులను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2.35 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాలోకి ఎగువ నుంచి వచ్చే నీరు సక్రమంగా వెళ్లకపోవడం వల్ల నీరు రోడ్డుపై నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీనికి పరిష్కారం వంతెన విస్తరణేనని భావించి నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.

మంత్రి వెంట కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొనటం దీపిక, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈ శివానంద్​ రెడ్డి ఉన్నారు.

ఇదీ చదవండి: అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.