భాగ్యనగరం మరో ప్రతిష్ఠాత్మక మారథాన్కు వేదిక కానుంది. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆగస్టు 24, 25 తేదీల్లో భారతీ ఎయిర్టెల్ 5కే,10 కే, పుల్ మారథాన్, హాఫ్ మారథాన్లను నిర్వహిస్తోంది. మారథాన్ లోగా, టీ షర్ట్లు, మెడల్స్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. భారతీ ఎయిర్టెల్ తెలుగురాష్ట్రాల సీఈవో అవ్నీత్ సింగ్ పూరి, హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ నన్నపనేని, రేస్ డైరెక్టర్ అభిజీత్ మధున్కర్ పాల్గొన్నారు. పరుగులో పాల్గొనవల్సిన వారు ఆన్లైన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: హుస్సేన్ సాగర్లో జాతీయ సెయిలింగ్ పోటీలు షురూ