ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కొత్తగా హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్స్టాప్ విమాన సేవలను ప్రారంభించింది. ఈ మేరకు చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైద్రాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం తెల్లవారుజామున 12.20 నిమిషాలకు మెుదటి విమానం చేరుకుంది.
238 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 ఫస్ట్ క్లాస్, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ సీట్లతో పాటు నలుగురు కాక్పిట్, 12 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం హైదరాబాద్లో విజయవంతంగా ల్యాండ్ పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేసారు. విమానం నడిపిన నలుగురు పైలెట్లను అధికారులు ఘనంగా సన్మానించారు.
ఇదీ చదవండి: ఐనవోలు జాతరకు జనసందోహం.. అధికారుల వైఫల్యం