ETV Bharat / state

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

author img

By

Published : Feb 14, 2021, 5:20 PM IST

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ముమ్మాటికీ ద్రోహమని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి గౌరవాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మూర్తి సూచించారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో రైటర్స్ అకాడమీ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొన్నారు. గంగవరం పోర్ట్ ప్రత్యేకంగా ఉక్కు పరిశ్రమ కోసం నిర్మించారని.. కానీ ఆ పోర్టును ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడం వల్ల నష్టం జరిగిందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

సొంత గనులు ఇవ్వాలని కోరినా... ఇవ్వకుండా ఉక్కు పరిశ్రమను ఇబ్బంది పెట్టారని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకునే వరకు పోరాడాలన్నారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

ఇదీ చదవండి: తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు : ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.