ETV Bharat / state

లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

author img

By

Published : Aug 19, 2020, 2:03 PM IST

Updated : Aug 19, 2020, 5:59 PM IST

acb has filed a petition for custody of the officers in the bribery case kesara
లంచం కేసులో అధికారుల కస్టడీకి అనిశా పిటిషన్

లంచం కేసులో తహసీల్దార్ నాగరాజు కస్టడీకి అవినీతి నిరోధక శాఖ పిటిషన్ వేసింది. తహసీల్దార్ నాగరాజుతో పాటు ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులను కస్టడీకి కోరింది.

మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా కీసర తహసీల్దార్ లంచం కేసులో అవినీతి నిరోధక శాఖ నాగరాజు కస్టడీకి పిటిషన్ వేసింది. తహసీల్దార్ నాగరాజుతో పాటు ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులను కస్టడీకి కోరింది. బెయిల్​పై ఉన్న స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్, వీఆర్ఏను తమ ముందు హాజరు కావాలని తెలిపింది. నలుగురు ఏడు రోజులు కస్టడీ కావాలని అనిశా అధికారులు కోరారు.

రూ.కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ నాగరాజు అనిశాకు పట్టుబడ్డారు. కీసర మండలంలో విలువైన భూమిని కాజేసేందుకు స్థిరాస్తి వ్యాపారులు కుట్ర పన్నారు. రాంపల్లి దాయరలో విలువైన భూమిపై అంజిరెడ్డి, శ్రీనాథ్ కన్నేసి.. తహసీల్దార్‌కు రూ.2 కోట్లు ఇచ్చేలా అంజిరెడ్డి, శ్రీనాథ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు అనిశా నిందితులను కస్టడీకి కోరింది.

ఇదీ చూడండి : లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి

Last Updated :Aug 19, 2020, 5:59 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.