ETV Bharat / state

రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Oct 5, 2020, 9:08 AM IST

Updated : Oct 5, 2020, 9:36 AM IST

1335-new-corona-cases-registered-in-the-state
రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

09:05 October 05

రాష్ట్రంలో రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

         రాష్ట్రంలో కరోనా కేసులు  2 లక్షలు దాటాయి. కొత్తగా మరో 1,335 కొవిడ్​ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 1,171 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని మరో 2,176 మంది డిశ్ఛార్జీ అయ్యారు. మొత్తం 1,72,388 మంది బాధితులు కొవిడ్‌ను జయించారు.

         రాష్ట్రంలో ప్రస్తుతం 27,052 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 22,134 మంది బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 262 మంది తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 137, మేడ్చల్ జిల్లాలో 91 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 72, కరీంనగర్ జిల్లాలో 83 మంది కొవిడ్​ బారిన పడ్డారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు

Last Updated : Oct 5, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.