ETV Bharat / state

Maoists release Engineer: ఇంజినీర్ విడుదల.. భార్యకు అప్పగించిన మావోయిస్టులు

author img

By

Published : Nov 17, 2021, 5:49 PM IST

Updated : Nov 17, 2021, 7:18 PM IST

ఛత్తీస్​గఢ్​లోని(chhattisgarh state) బీజాపూర్ జిల్లాలో ఇంజినీర్​ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇవాళ ప్రజాకోర్టులో విడుదల చేశారు. దాదాపు ఏడు రోజుల తర్వాత ఆయనను వదిలిపెట్టారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య కూడా అక్కడే ఉన్నారు. ఇదివరకే ఇంజినీర్​తో పాటు కిడ్నాప్​ చేసిన అటెండర్​ను 5రోజుల క్రితమే విడిచిపెట్టిన మావోయిస్టులు తాజాగా ఇంజినీర్​ను ఆయన భార్యకు అప్పగించారు.

Engineer Release
ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా

మావోయిస్టులు ఏడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాను(Engineer ajay roshan lakra) విడిచిపెట్టారు. ఛత్తీస్​గఢ్​లోని(chhattisgarh state) బీజాపూర్ జిల్లాలో ఆయనను అపహరించిన మావోయిస్టులు ఇవాళ ప్రజాకోర్టులో మీడియా ముందు విడుదల చేశారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పితా లక్రా కూడా అక్కడే ఉన్నారు.

గత ఏడు రోజులుగా మీడియా, పెద్దలు ఇంజినీర్​ను విడుదల చేయాలంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఇంజినీర్ ఆచూకీ కోసం భార్యతో సహా మీడియా సిబ్బంది 7 రోజుల పాటు అడవుల్లో గాలించారు.

Engineer Release
తన భార్యతో విడుదలైన ఇంజినీర్

ప్రధాన​మంత్రి గ్రామ్ సడక్ యోజన(PMGSY) పథకం కింద బీజాపూర్​లోని(bijapur district) మనకేలీ గోరనా ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రా(36)(Engineer ajay roshan lakra) , అటెండర్​ లక్ష్మణ్ పర్తగిరి(26)ను మావోయిస్టులు కిడ్నాప్​ చేశారు.

రెండు రోజులకే అటెండర్​ విడుదల..

ఇద్దరు ఉద్యోగులను అపహరించిన మావోయిస్టులు.. అందులో అటెండర్​ లక్ష్మణ్​ పర్తగిరిని రెండు రోజుల అనంతరం విడిచిపెట్టారు. ఇంజనీర్​ లక్రా వారి చెరలోనే ఉండగా తాజాగా ఇవాళ ప్రజాకోర్టులో విడులదయ్యారు.

ఇదీ చూడండి:

ఇద్దరు ఉద్యోగస్థులను కిడ్నాప్ చేసిన నక్సలైట్లు

Last Updated :Nov 17, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.