భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తరలించాలని కోరుతూ.. అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని క్వారంటైన్ కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. వర్షాకాలంలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని కోరారు.