ETV Bharat / state

'జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'

author img

By

Published : May 3, 2021, 4:45 PM IST

రైతులు పండించిన జొన్నపంటను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్​ కలెక్టర్ రాహుల్​రాజ్​కు పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

adilabad news, adilabad sorgum farmers, sorghum crop
ఆదిలాబాద్ జిల్లా వార్తలు, ఆదిలాబాద్​ జొన్న పంట, జొన్న రైతులకు కష్టాలు, జొన్న పంట కొనుగోళ్లు

జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత్ అన్నారు. ఫలితంగా కర్షకులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్​రాజ్​కు వినతి పత్రాన్ని అందించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి.. చర్యలు చేపట్టి.. రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.