పౌరసత్వ సవరణ చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో అఖిల పక్ష నేతలు ఆందోళనకు దిగారు. మసీదు నుంచి వినాయకచౌక్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు.
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అఖిలపక్ష నేతలు అన్నారు. మోదీ విధానాలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
- ఇవీ చూడండి: హైదరాబాద్లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం