ETV Bharat / sports

పాకిస్థాన్​ అథ్లెట్​కు నీరజ్ సూచనలు

author img

By

Published : Aug 12, 2021, 9:36 AM IST

neeraj chopra
నీరజ్​ చోప్డా

నీరజ్​ చోప్డా, అర్షద్​ నదీమ్​.. టోక్యో ఒలింపిక్స్​లో ఆసియా తరఫున జావెలిన్​ త్రో ఈవెంట్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత్​- పాక్​ అథ్లెట్లు. నీరజ్​ పసిడిని ముద్దాడగా.. నదీమ్​ మాత్రం 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత.. నదీమ్​తో తాను మాట్లాడినట్లు తెలిపాడు నీరజ్.

టోక్యో ఒలింపిక్స్​ జావెలిన్​ త్రోలో భారత్​-పాకిస్థాన్​లు ఫైనల్​కు చేరుకున్నాయి. ఆ తర్వాత.. చరిత్ర సృష్టిస్తూ నీరజ్​ చోప్డా(Neeraj Chopra) పసిడిని ముద్దాడాడు. పాకిస్థాన్​ అథ్లెట్​ అర్షద్​ నదీమ్(Arshad Nadeem javelin)​.. 5వ స్థానంలో నిలిచాడు. అయితే ఫైనల్​ అనంతరం నదీమ్​తో తాను ఏం మాట్లాడాననే విషయాన్ని నీరజ్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వచ్చే ఒలింపిక్స్​ కోసం కష్టపడాలని సూచించినట్లు చెప్పాడు.

"పతకం సాధించాలంటే.. ఆ సమయంలో కొంత అదృష్టం కూడా ఉండాలి. మేమిద్దరం ఫైనల్​కి వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విషయం నదీమ్​కు కూడా చెప్పాను. జావెలిన్​లో ఆసియా అథ్లెట్లు మంచి ప్రదర్శన చేయడం చాలా అరుదు. ఆధిపత్యం అంతా యూరోపియన్​ అథ్లెట్లదే. తొలిసారి ఇండియా- పాకిస్థాన్​ ఫైనల్​కు వెళ్లాయి. కష్టపడి అక్కడి వరకు వెళ్లాము. నదీమ్​కు మెడల్​ రాలేదు. వచ్చే ఒలింపిక్స్​ కోసం కష్టపడు, ఆల్​ ది బెస్ట్​ అని నేను నదీమ్​కు చెప్పాను."

- నీరజ్​ చోప్డా, అథ్లెట్​.

క్వాలిఫయర్స్​లో తొలి ప్రయత్నంలోనే 86.65మీటర్లు త్రో వేసి నీరజ్​ దుమ్మురేపగా.. నదీమ్​ 85.16మీటర్ల త్రో వేశాడు. ఇక ఫైనల్​లో రెట్టింపు ఉత్సాహంతో నీరజ్​ 87.58మీటర్లు వేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. నదీమ్​ మాత్రం 84.62 మీటర్లతో 5వ స్థానంలో నిలిచాడు.

అభినవ్​ బింద్రా(2008) తర్వాత దేశానికి వ్యక్తిగత స్వర్ణం తీసుకొచ్చాడు నీరజ్​. అతడి ప్రదర్శనతో యావత్​ దేశం పులకరించింది. ప్రశంసలతో ముంచెత్తింది. అనేక ప్రభుత్వాలు, సంస్థలు నీరజ్​కు కానుకలు, నజరానాలు అందిస్తున్నాయి.

ఇదీ చూడండి:- నీరజ్​ స్వర్ణ మెరుపులు.. ఒలింపిక్స్​ అద్భుతాల్లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.