ETV Bharat / sports

Tokyo Paralympics 2020: భారత పారా అథ్లెట్లకు 'సైకత' శుభాకాంక్షలు

author img

By

Published : Aug 24, 2021, 9:36 AM IST

Updated : Aug 24, 2021, 11:46 AM IST

Sidarshan Pattnaik
సుదర్శన్ పట్నాయక్

ఒడిశా పూరీ బీచ్​లో భారత పారా అథ్లెట్లకు తన సైకత శిల్పంతో మద్దతు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik)​. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. పారాలింపిక్స్​లో (Tokyo Paralympics 2020) భారత్​ గెలుపుకోసం ప్రార్థించాలని పేర్కొన్నారు.

ప్రముఖ సైకత శిల్పి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్​ పట్నాయక్ (Sudarsan Pattnaik)​ తనదైన రీతిలో భారత పారా అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా పూరీ బీచ్​లో ఆటగాళ్లకు మద్దతుగా అద్భుతమైన సైకత శిల్పాన్ని నిర్మించారు. టోక్యో పారాలింపిక్స్​లో (Tokyo Paralympics 2020) పాల్గొంటున్న భారత క్రీడాకారుల కోసం ప్రార్థించాలని పేర్కొన్నారు. ఈ ఫొటోను తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు.

మంగళవారం (ఆగస్టు 23) నుంచి టోక్యో వేదికగా పారాలింపిక్స్​ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచదేశాల నుంచి 4500 అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. భారత్​ నుంచి ఈ సారి అత్యధికంగా 54 మంది ఆటగాళ్లు విశ్వ క్రీడా సంబరంలో పాల్గొననున్నారు. ఈ దఫా మన అథ్లెట్లు 15 పతకాలు సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేవేంద్ర జజారియా, మరియప్పన్‌ తంగవేలు సహా స్టార్‌ అథ్లెట్లు చాలామందే ఉన్నారు.

ఇదీ చదవండి: Tokyo Paralympics: విశ్వ క్రీడా సంబరం మళ్లీ మొదలైంది

Last Updated :Aug 24, 2021, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.