నా మెడల్.. తర్వాతి జనరేషన్​కు ఇన్​స్పిరేషన్: పీవీ సింధు

author img

By

Published : Aug 1, 2021, 9:19 PM IST

PV Sindhu

ఈసారి ఒలింపిక్స్​లో కాంస్యంతో సరిపెట్టుకున్న పీవీ సింధు.. పారిస్​ ఒలింపిక్స్​లో మాత్రం కచ్చితంగా బంగారు పతకం సాధిస్తానని స్పష్టం చేసింది. వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్​ మెడల్​ గెలుచుకున్న భారత తొలి క్రీడాకారిణి ఈమెనే.

టోక్యో ఒలింపిక్స్​లో పతకం గెలుచుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. రానున్న జనరేషన్​కు​ ఈ మెడల్స్ స్పూర్తిగా నిలుస్తాయని చెప్పింది. ఆదివారం జరిగిన మ్యాచ్​లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-13, 21-15పై గెలిచిన ఆమె.. వరుసగా రెండోసారి ఒలింపిక్స్​ పతకం దక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్​లో ఆమె రజతం దక్కించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండు పతకాలు సొంతం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.

PV Sindhu Tokyo Olympics
కాంస్య పతకంతో పీవీ సింధు

"చాలామంది యువతీయువకులు.. ఈ పతకాల్ని చూసి స్పూర్తి పొందుతారు. ఒలింపిక్స్​లో పాల్గొనేలా కష్టపడాతారు. చేయగలను, సాధించగలను అనుకుంటే ఎవరైనా గెలవగలరు" అని సింధు చెప్పింది. గత ఒలింపిక్స్​ కంటే మెరుగైన పతకం సాధించనందుకు బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది.

"ఈ ఒక్క మ్యాచ్​ కోసం నా భావోద్వేగాల్ని నియంత్రించుకుని ఆడాను. పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది. దేశం కోసం మెడల్​ సాధించడం నాకే కాదు అందరికీ గర్వంగా ఉంటుంది. 2024 పారిస్​ ఒలింపిక్స్​లో కచ్చితంగా బంగారం గెలుచుకునేలా కష్టపడతాను" అని సింధు చెప్పింది.

PV Sindhu Tokyo Olympics Bronze
విజయానందంతో సింధు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.