ETV Bharat / sports

Olympics: పీవీ సింధు గురించి ఈ విషయాలు తెలుసా?

author img

By

Published : Aug 1, 2021, 7:41 PM IST

SINDHU
సింధు

టోక్యో ఒలింపిక్స్​లో తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. అయితే ఈమె తల్లిదండ్రులు కూడా అథ్లెట్లే అని, చిన్నతనంలో బ్యాడ్మింటన్​ నేర్చుకునేందుకు రోజూ 120 కిలోమీటర్లు ప్రయాణం చేసేదని తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి.

పీవీ సింధు.. ఇప్పుడు దేశంలో మారుమోగిపోతున్న పేరు ఇది. టోక్యో ఒలింపిక్స్​లో ఈ స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ కాంస్యం సొంతం చేసుకుని దేశానికి మరో మెడల్​ను అందించింది. ఈ క్రమంలో సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సింధు గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

వారూ అథ్లెట్లే..

సింధు తల్లిదండ్రుల పేర్లు పీవీ రమణ, పీ విజయ. వారిద్దరు కూడా అథ్లెట్లు కావడం విశేషం. జాతీయ స్థాయిలో వాలీబాల్​ జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించారు. 2000లో పీవీ రమణ అర్జున అవార్డును కూడా దక్కించుకున్నారు. తల్లిదండ్రులకు తగ్గట్టుగానే సింధు కూడా క్రీడలవైపు ఆసక్తి కనబరిచింది.

7-interesting-facts-about-pv-sindhu
కుటుంబసభ్యులతో

120 కిలోమీటర్ల ప్రయాణం..

యుక్తవయస్సులోనే బ్యాడ్మింటన్​వైపు అడుగులు వేసింది సింధు. తల్లిదండ్రుల అండతో కలను నిజం చేసుకోగలిగింది. సింధును ఉదయాన్నే 3 గంటలకు పుల్లెల గోపీచంద్​ అకాడమీకి తీసుకెళ్లేవారు రమణ. ఇది 12ఏళ్ల పాటు సాగింది. అందుకు వారు రోజుకు 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.

7-interesting-facts-about-pv-sindhu
టోక్యో ఒలింపిక్స్​లో కాంస్యం గెలిచిన క్షణాలు..

సొదరి పెళ్లి..

సింధు సోదరి పీ దివ్య వివాహం 2012లో హైదరాబాద్​లో జరిగింది. ఆ సమయంలోనే సయ్యద్​ మోదీ అంతర్జాతీయ ఇండియా గ్రాండ్​ ప్రిక్స్​ గోల్డ్​ టోర్మమెంట్​.. లఖ్​నవూలో జరిగింది. ఫైనల్​కు చేరుకున్న 17ఏళ్ల సింధు.. సోదరి వివాహానికి హాజరుకాలేకపోయింది.

7-interesting-facts-about-pv-sindhu
సోదరితో సింధు

ఫోన్​ లేకుండా మూడు నెలలు..

2016 రియో ఒలింపిక్స్​లో సిల్వర్​ గెలిచిన సింధు.. ఆ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్​ ప్లేయర్​గా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్​ కోసం కఠోర శిక్షణ తీసుకుంది సింధు. అందులో భాగంగా.. సింధు ఫోన్​ను కోచ్​ పుల్లెల గోపీచంద్​ మూడు నెలల పాటు తన దగ్గరపెట్టుకున్నారు. ఒలింపిక్స్​లో సత్తా చాటిన తర్వాత గోపీచంద్​ నుంచి ఆమె తన ఫోన్​ తీసుకుంది.

7-interesting-facts-about-pv-sindhu
సయ్యద్​ మోదీ అంతర్జాతీయ ఇండియా గ్రాండ్​ ప్రిక్స్​ గోల్డ్​ టోర్మమెంట్​లో..

సచిన్​ గిఫ్ట్​..

రియో ఒలింపిక్స్​లో రజతం గెలిచిన సింధుకు ఎన్నో అవార్డులు, బహుమతులు లభించాయి. వాటిల్లో భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ఇచ్చిన గిఫ్ట్​ ప్రత్యేకంగా నిలిచిపోయింది. బీఎండబ్ల్యూ కారును ఆయన సింధుకు కానుకగా ఇచ్చాడు.

స్విమ్మింగ్​ కూడా..

శిక్షణ లేని సమయంలో పీవీ సింధు స్విమ్మింగ్​ చేస్తుంది. ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్​ కూడా చేస్తుంది.

పెద్ద ఫుడీ...

పీవీ సింధు పెద్ద ఫుడీ. ఈ విషయం ఆమె ఇన్​స్టాగ్రామ్​ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. పెరుగంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో సింధు చెప్పింది. 2016 ఒలింపిక్స్​ కోసం పెరుగును పక్కన పెట్టింది.

7-interesting-facts-about-pv-sindhu
ఫుడీ సింధు

ఇదీ చూడండి:- సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.