ETV Bharat / sports

'దానికోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి'.. రెజ్లర్ వీరేందర్ ఆవేదన

author img

By

Published : Jan 16, 2022, 12:44 PM IST

Wrestler Virender Singh: దివ్యాంగ రెజ్లర్​ వీరేందర్​ సింగ్​కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ. 1.20కోట్ల నగదు బహుమానం ఇచ్చినట్లు హరియాణా క్రీడా విభాగం డైరెక్టర్​ పంకజ్​ నైన్ తెలిపారు. అయితే.. వీరేందర్​ ఉద్యోగం ఆఫర్​ను తిరస్కరించారని పేర్కొన్నారు.

virender singh
వీరేందర్ సింగ్

Wrestler Virender Singh: హరియాణాకు చెందిన దివ్యాంగ రెజ్లర్​, పద్మశ్రీ అవార్డు గ్రహీత వీరేందర్​ సింగ్​కు ప్రభుత్వం రూ. కోటి 20 లక్షలు నగదు బహుమానం ఇచ్చిందని రాష్ట్ర స్పోర్ట్స్, యూత్ అఫైర్స్ డిపార్ట్​మెంట్ డైరెక్టర్ పంకజ్ నైన్ తెలిపారు. ఈ నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే.. వీరేందర్ ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించలేదని వెల్లడించారు.

"వీరేందర్ సింగ్​కు హరియాణా సర్కారు రూ. 1.20 కోట్లు అందజేసింది. క్రీడాశాఖలో అతడు ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే.. పారాలింపియన్స్​తో పనిచేసేలా గ్రూప్​ బీ స్థాయి ఉద్యోగం ఇస్తే అతడు స్వీకరించలేదు." అని పంకజ్ స్పష్టం చేశారు. వీరేందర్​ డిమాండ్లకు సంబంధించి ఓ కమిటీ ఏర్పాటు చేసి పలు అంశాలపై ఆరా తీశామని తెలిపారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పించనుందని పేర్కొన్నారు.

మళ్లీ చర్చల్లోకి..

ఆదివారం, ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ను ఉద్దేశిస్తూ వీరేందర్​ సింగ్ మరో ట్వీట్ చేశారు. 'ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ గారు.. నేను పాకిస్థాన్​ వాడినా?. కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు. నాకు అందరిలా సమాన హక్కులు ఎప్పుడు వర్తిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా అన్యాయం జరగనివ్వమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడేం జరుగుతోంది మరి.' అని వీరేందర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పంకజ్ నైన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

  • माननीय मुख्यमंत्री श्री @mlkhattar जी क्या मैं पाकिस्तान से हूँ
    कब बनेगी कमेटी, कब मिलेंगे समान अधिकार,

    माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, जब मैं आपसे मिला, आपने ही कहा था हम आपके साथ अन्याय नही होने देंगे, अब आप ही देख लो!🙏 @ANI pic.twitter.com/q4LQBPsN2Y

    — Virender Singh (@GoongaPahalwan) January 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వీరేందర్​ డిమాండ్?

తనలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న రాష్ట్రంలోని క్రీడాకారులను పారా అథ్లెట్లుగా గుర్తించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివ్యాంగ రెజ్లర్​ వీరేందర్ సింగ్ గతంలో హరియాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. గతేడాది నవంబర్​లో పద్మశ్రీ అవార్డు తీసుకున్న మరుసటి రోజే.. దిల్లీలోని హరియాణా భవన్​ ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అతడి డిమాండ్​పై పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి మనోహర్​లాల్​ ఖట్టర్​ హామీ ఇచ్చారు.

వీరేందర్​ సోదరుడు ఏమన్నారంటే..

రాష్ట్రంలోని వినికిడి సమస్య ఉన్న క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం హరియాణా మంత్రులను ఎన్నో ఏళ్లుగా వీరేందర్ కలుస్తున్నారని ఆయన సోదరుడు రాంబీర్ తెలిపారు. 2017లో వీరేందర్​కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6కోట్లు ప్రకటించిందని అయితే ఆ డబ్బు ఇంకా ఇవ్వలేదని, గ్రేడ్-ఏ ఉద్యోగం ప్రకటించినా.. అది ఇంకా రాలేదని గతంలో తెలిపారు.

ఇదీ చదవండి:

నిన్న పద్మ పురస్కారం స్వీకరణ- నేడు ప్రభుత్వంపై నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.