ETV Bharat / sports

భారత్​లో పబ్​జీకి 'ఒలింపిక్స్' గుర్తింపు!.. నిజమెంత?

author img

By

Published : Jun 16, 2022, 4:35 PM IST

PUBG recognition news: భారత్​లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీకి బానిసలుగా చాలా మంది మారిపోతున్నారు. ఆట మోజులో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. అందువల్లే కొన్నేళ్ల క్రితం భారత్..​ ఈ గేమ్​పై నిషేధం విధించింది. అయినా మొబైైల్​లో పబ్​జీ డౌన్​లోడ్ అవుతుండడంపై జాతీయ బాలల కమిషన్.. కేంద్ర ఐటీ శాఖ, ఐఓఏకు లేఖ రాసింది.

PUBG Olympics
పబ్​జీ

PUBG recognition news: భారత్​లో పబ్​జీ మొబైల్​ గేమ్​కు ఎటువంటి గుర్తింపును ఇవ్వలేదని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్​ బాత్రా స్పష్టం చేశారు. చట్టానికి, దేశానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోబోమని తెలిపారు. ఇటువంటి ప్రమాదకర ఆటను ప్రోత్సహించమని పేర్కొన్నారు.
కేంద్ర ఐటీ శాఖకు, భారత ఒలింపిక్‌ సంఘానికి.. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇటీవల​ లేఖ రాసింది. పబ్​జీను భారత్​లో నిషేధం విధించినా ఎలా డౌన్​లోడ్ అవుతోందని ఈ లేఖలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరీందర్ వివరణ ఇచ్చారు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్​కు లేఖ రాశాం. వారి నుంచి వివరణాత్మక సమాధానాన్ని కోరుకుంటున్నాం. మాకు ఐటీ శాఖ నుంచి సమాధానం కావాలి. పబ్​జీ లాంటి ఆటలు పిల్లల్లో హింసను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఇలాంటి ఆటలను నిషేధించాలి. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాలి.

-ప్రియాంక కనూంగో, ఎన్​సీపీసీఆర్ ఛైర్​పర్సన్​

16 ఏళ్ల కుర్రాడు పబ్​జీకి బానిసై కన్నతల్లిని కాల్చి చంపేశాడు. అనంతరం 10 ఏళ్ల సోదరిని గదిలో బంధించి తల్లి మృతదేహం వద్దే కూర్చున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో జూన్​8న జరిగింది. మొబైల్​ గేమ్​ పబ్​జీ వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

ఇవీ చదవండి: ఇంగ్లాండ్​కు భారీ షాక్​.. డబ్ల్యూటీసీ పాయింట్లు, ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో కోత

ఇంగ్లాండ్​కు టీమ్​ఇండియా.. ఆఖరి టెస్టులో కొత్త కెప్టెన్లతో బరిలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.