ETV Bharat / sports

రెజ్లర్​ సుశీల్​పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్​

author img

By

Published : Aug 2, 2021, 4:00 PM IST

మల్లయోధుడు సాగర్​ రానా హత్య కేసు ప్రధాన నిందితుడు రెజ్లర్​ సుశీల్ కుమార్​ (sushil kumar wrestler)తో పాటు మరో 19మందిపై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేశారు. ఇందులో సుశీల్​ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

Wrestler Sushil Kumar
రెజ్లర్ సుశీల్ కుమార్

రెజ్లర్​ సుశీల్​ కుమార్​ (sushil kumar wrestler)పై దిల్లీ పోలీసులు ఛార్జిషీట్​ దాఖలు చేశారు. తుది నివేదిక ప్రకారం అతడిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ రిపోర్టును చీఫ్​ మెట్రోపాలిటన్​ మేజిస్ట్రేట్​ సత్వీర్ సింగ్ లంబాకు అందించారు.

మే 4న దిల్లీలోని ఛత్రశాల్​ స్టేడియం వద్ద మల్లయోధుడు సాగర్​ రానాను సుశీల్​తో పాటు అతని సన్నిహితులు హత్య చేశారు. ఈ దాడిలో సాగర్​ అక్కడిక్కడే మృతి చెందగా, అతడి మిత్రులు సోను, అమిత్ కుమార్​ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఇందులో 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన వారిని పట్టుకునే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి: స్టార్ ఆటగాళ్లను భయపెడుతున్న ఆ 'ఒక్కటి'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.