ETV Bharat / sports

మేరీ కోమ్​కు ప్రెసిడెంట్​ కప్​లో పసిడి

author img

By

Published : Jul 28, 2019, 5:01 PM IST

Updated : Jul 29, 2019, 12:21 AM IST

మేరీ కోమ్

ప్రెసిడెంట్​ కప్​లో మేరీ కోమ్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఏప్రిల్​ ఫ్రాంక్స్​పై 5-0 తేడాతో విజయం సాధించిం పసిడి కైవసం చేసుకుంది. సెప్టెంబర్​లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్​షిప్స్​పై దృష్టిపెట్టింది.

ఇండోనేసియాలో జరుగుతోన్న 23వ ప్రెసిడెంట్ కప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్​ సత్తాచాటింది. 51 కేజీల విభాగంలో చెమట చిందించకుండానే పసిడిని కైవసం చేసుకుంది. తుదిపోరులో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఏప్రిల్​ ఫ్రాంక్స్​పై (ఆస్ట్రేలియా) 5-0 తేడాతో విజయం సాధించింది.

రెండు నెలల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ​ ద్వారా రింగులోకి అడుగుపెట్టిన మేరీ బంగారు పతకంతో ఆకట్టుకుంది. బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్​షిప్ పోటీల​ ముందు ఈ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.

మేలో జరిగిన ఇండియా ఓపెన్​లో మేరీ స్వర్ణాన్ని గెలిచింది. అనంతరం థాయ్​లాండ్​లో జరిగిన ఆసియన్ ఛాంపియన్​షిప్స్​కు దూరంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్​ అర్హతపై దృష్టి పెట్టిన కారణంగా ఈ పోటీల్లో పాల్గొనలేదు.

రష్యా వేదికగా సెప్టెంబరు 7 నుంచి జరగనున్న ప్రపంచ ఛాంపియన్​షిప్ పోటీల్లో సత్తాచాటి టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందీ మణిపూర్ మణిపూస.

ఇది చదవండి: కపిల్​ ​బృందంపై ఫిర్యాదు- కోచ్ ఎంపిక ఎలా?

New Delhi, Jul 28 (ANI): Prime Minister Narendra Modi addressed the nation through 'Mann Ki Baat' on Sunday. During 'Mann Ki Baat' programme, he congratulated Meghalaya government for becoming 1st state to have its own water-policy. He said, "I congratulate Meghalaya govt. In Haryana, crops that require meagre water are being encouraged. Farmers thus are saved from suffering losses".
Last Updated :Jul 29, 2019, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.