ETV Bharat / sports

ఇండియా ఓపెన్ నెగ్గిన లక్ష్యసేన్.. సాత్విక్- చిరాగ్ జోడీదే డబుల్స్ టైటిల్

author img

By

Published : Jan 16, 2022, 6:53 PM IST

india open
ఇండోనేసియాపై భారత్​ ఘన విజయం

India Open 2022 Badminton: ఇండియా ఓపెన్​ ఫైనల్స్​లో భారత్​ స్టార్​ షటర్లు లక్ష్యసేన్​, సాత్విక్​ సాయిరాజ్-చిరాగ్​ శెట్టి జోడి అదరగొట్టారు. సింగిల్స్​లో ​సింగపూర్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్​ లోహ్​ కీయన్​ యూపై లక్ష్యసేన్​ విజయం సాధించగా.. డబుల్స్​లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్​ అయిన ఇండోనేసియా మోహమ్మద్​ అహసన్​-హెంద్రా సెతియావాన్లపై​ సాత్విక్​-చిరాగ్​ జోడి నెగ్గి టైటిల్​ సొంతం చేసుకుంది.

India Open 2022 Badminton: ఇండియా ఓపెన్​ 2022 ఫైనల్​లో.. యువ షట్లర్ లక్ష్యసేన్ ఘన విజయం సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్​లో భాగంగా ఆదివారం జరిగిన పోటీల్లో సింగపుర్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్ లోహ్​ కీయన్​ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు.

డబుల్స్​లో కూడా..

భారత స్టార్​ బ్యాడ్మింటన్​ జోడి సాత్విక్​ సాయిరాజ్​ - చిరాగ్​ శెట్టి చరిత్ర సృష్టించారు. తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్​ టైటిల్​ను​ సొంతం చేసుకున్నారు. ​ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేసియా జోడి మోహమ్మద్​ అహసన్​-హెంద్రా సెతియావాన్లపై హోరాహోరీగా పోరాడి ఘన విజయం సాధించారు.

43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్​లో.. రెండు వరుస సెట్లలో 21-16, 26-24 పాయింట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించారు.

ఇదీ చూడండి : 'దానికోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి'.. రెజ్లర్ వీరేందర్ ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.