ETV Bharat / sports

ప్రపంచ బ్యాడ్మింటన్​లో ప్రణయ్​, శ్రీకాంత్​, లక్ష్యసేన్​లు బోణీ

author img

By

Published : Aug 22, 2022, 1:39 PM IST

Updated : Aug 22, 2022, 9:21 PM IST

lakshya sai praya
లక్ష్యసేన్​

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​ పోటీలు నేడు(సోమవారం) ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ పోటీల్లో భారత్​కు పురుషుల సింగిల్స్ మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్​, మిక్స్​డ్​ డబుల్స్​లో విజయం దక్కి తరువాత రౌండ్​లకు అర్హత సాధించారు. ​

BWF world championship tokyo: ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భాగంగా జరిగిన తొలి రోజు పోటీల్లో భారత్​కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల సింగిల్స్​ విభాగంలో సాయి ప్రణీత్‌ ఔట్​ కాగా, వరుసగా లక్ష్యసేన్​, శ్రీకాంత్ లు భారత్​కు గెలుపొందారు. మహిళల మిక్స్​డ్​ డబుల్స్​లో పాల్గొన్న ఇషాన్‌- తనీష, అశ్విని - సిక్కిరెడ్డిలు విజయం సాధించి తరువాత రౌండ్​కు అర్హత పొందారు.

పురుషుల సింగిల్స్​ విభాగంలో పాల్గొన్న 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ కాంస్య విజేత సాయి ప్రణీత్‌ ప్రపంచ బ్యాడ్మింటన్​ ర్యాకింగ్స్​లో నాల్గవ స్థానంలో ఉన్న చైనీస్ చౌ టియన్ చెన్ చేతిలో 15-21 21-15 15-21 తేడాతో ఓటమి ఎదురైంది. సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్​ డెన్మార్క్ ప్రత్యర్థి హన్స్-క్రిస్టియన్ సోల్బర్గ్ విట్టింగస్ పై 21-12 21-11 తేడాతో గెలుపొందారు. పురుషుల డబుల్స్​లో అత్రి- సుమీత్‌ రెడ్డిలు జపాన్​కు చెందిన మసయుకి ఒనోడెరా - హిరోకి ఒకమురా చేతిలో 21-11 19-21 21-15 తేడాతో ఓటమి పాలయ్యారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం పతక విజేతలైన అశ్విని పొన్నప్ప -సిక్కిరెడ్డిలు.. మహిళల డబుల్స్​లో మాల్దీవులులకు చెందిన అమినాత్​ నబియా అబ్దుల్​ రజాక్​, ఫాతిమాత్​ నబాహా అబ్దుల్​ రజాక్​ల​ పై 1-7, 21-9 తేడాతో విజయం సాధించారు. మహిళల మిక్స్​డ్​ డబల్స్​లో ఇషాన్‌ భట్నాగర్​ - తనీష క్రాష్టోలు జర్మన్​కు చెందిన పాట్రిక్ స్కీల్ - ఫ్రాంజిస్కా వోల్క్‌మాన్​లపై 21-13 21-13 తేడాతో విజయం సాధించారు.

పురుషుల డబుల్స్​లో అర్జున్​ - కపిల్​లు థాయిలాండ్​కు చెందిన సుపక్ జోమ్కోహ్ - కిట్టినుపోంగ్ కేడ్రెన్​లపై 21-17 17- 21 22-20 తేడాతో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్​లో ప్రణయ్​ ఆస్ర్టియాకు చెందిన లుకా వాబర్ పై 21-12 21-11 తేడాతో గెలుపొందాడు. పురుషుల సింగిల్స్​లో కిదంబి శ్రీకాంత్​ ఐర్లాండ్​ కు చెందిన నహాత్​ ఎన్గుయెన్​తో జరిగిన హోరాహోరి మ్యాచ్​లో 22-20 21-19 స్వల్ప తేడాతో భారత్​ తరపున విజయం సాధించాడు. మహిళల సింగిల్స్​ విభాగంలో డెన్మార్క్​కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్ చేతిలో మాళవిక 21-14 21-12 తేడాతో పరాజయం పాలైంది.

ఇదీ చూడండి: కోహ్లీఫామ్​పై పాక్​ మాజీ కెప్టెన్​ ఆసక్తికర వ్యాఖ్యలు

Last Updated :Aug 22, 2022, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.