ETV Bharat / sports

లక్ష్యసేన్​కు నిరాశ.. ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​ ఫైనల్లో ఓటమి

author img

By

Published : Mar 20, 2022, 10:50 PM IST

లక్ష్యసేన్​
lakshya sen

​All England Open: ఆల్​ ఇంగ్లాండ్ ఓపెన్​లో భారత యువకెరటం లక్ష్యసేన్​కు నిరాశ ఎదురైంది. ఫైనల్లో ప్రపంచ నంబర్​ వన్​ అక్సెల్​సెన్​ చేతిలో ఓడిపోయి​ రన్నరప్​గా నిలిచాడు.

All England Open: ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత యువ కెరటం లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. ఫైనల్లో ప్రపంచనంబర్​ వన్​ అక్సెల్​సెన్​ చేతిలో 21-10, 21-15 తేడాతో ఓటమి పాలయ్యాడు. రన్నరప్​తో సరిపెట్టుకున్నాడు.

మెన్స్​ సింగిల్స్​ రెండో రౌండ్‌లో ప్రపంచ నంబర్ 3 ర్యాంకర్‌ను ఓడించి మరీ క్వార్టర్స్‌కు వచ్చిన లక్ష్యసేన్‌కు అదృష్టం కలిసొచ్చింది. క్వార్టర్స్‌లో చైనా ఆటగాడు జువాంగ్ జు తప్పుకోవడం (వాకోవర్‌) వల్ల లక్ష్యసేన్‌ సెమీస్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో గొప్ప పోరాటంతో డిఫెండింగ్​ ఛాంపియన్​, మలేసియాకు చెందిన లీ జియాపై విజయం సాధించి టైటిల్‌పై ఆశలు రేపిన అతడు తుది సమరంలో తడబడ్డాడు.

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్​ సూపర్​ 500 టైటిల్​ను గెలుచుకున్న లక్ష్యసేన్​ అప్పటి నుంచి మంచి ఫామ్​లో ఉన్నాడు. గత వారం జరిగిన జర్మన్​ ఓపెన్​లో అతడు రన్నరప్​గా నిలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో కాంస్య పతకం సాధించాడు.

ఇదీ చదవండి: భారత్-లంక పింక్​ బాల్​ టెస్టు.. పిచ్​కు దారుణమైన రేటింగ్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.