ETV Bharat / sports

ఓటమితో సీజన్​ను ముగించిన ఆర్సీబీ.. ముంబయి గెలిచినా దిల్లీనే నెం.1

author img

By

Published : Mar 21, 2023, 6:51 PM IST

Royal Challengers Bangalore Women vs Mumbai Indians Women
ఆర్సీబీపై ముంబయి విజయం

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా నేడు(మార్చి 21) జరిగిన మొదటి మ్యాచ్​లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

డబ్ల్యూపీఎల్‌ చివరి అంకానికి చేరింది. నేటితో లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అయితే నేడు(మార్చి 21) జరిగిన మొదటి మ్యాచ్​లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్​ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​ను ఆర్సీబీ ఓటమితో ముగించింది. ఈ సీజన్​లో ముంబయి ఇండియన్స్​తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్​లో ఘోరంగా ఓడింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హర్మన్​ ప్రీత్​ కౌర్​ సేన.. 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 129 పరుగులు చేసింది. హెలీ మ్యాథ్యూస్​(24), యస్తికా భాటియా(30), చివర్లో వచ్చిన పూజా వస్త్రాకర్​(19), అమెలియా కెర్​(31) లక్ష్యాన్ని ఛేదించారు. ఆర్సీబీ బౌలర్లలో కనిక అహుజా 2, ఆషా శోభనా, ఎల్లిస్​ పెర్రీ, శ్రేయంక పాటిల్​, మేఘన షట్​ తలో వికెట్ తీశారు. అయితే ముంబయి ఈ లక్ష్యాన్ని మరింత త్వరగా ఛేదించే ఉంటే.. పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానానికి చేరుకునేది. కానీ అది జరగలేదు. దీంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఫలితంగా దిల్లీ క్యాపిటల్సే పాయింట్స్​ టేబులో నెం.1 స్థానంలో ఉంది. అయితే మరికాసేపట్లో యూపీ వారియర్స్ - దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో యూపీ.. దిల్లీని భారీ తేడాతో ఓడిస్తే మాత్రం.. అప్పుడు ముంబయి నెంబర్ వన్ స్థానానికి చేరే అవకాశముంటుంది.

అంతకుముందు టాస్‌ ఓడి ఫస్ట్​ బ్యాటింగ్‌ చేసిన రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఎల్లీస్‌ పెర్రీ (29; 38 బంతుల్లో 3 ఫోర్లు) పర్వాలేదనిపించగా.. రిచా ఘోష్‌ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔటైంది. స్మృతి మంధాన (24; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పర్వాలేదనిపించింది. సోఫీ డివైన్‌ డకౌట్​గా వెనుదిరిగింది. హెథర్‌ నైట్‌ (12), కనికా అహుజా (12) తక్కువ స్కోరుకే ఔట్ అయిపోయారు. శ్రేయంకా పాటిల్ (4), మేఘన్‌ స్కట్ (2), దిశా కాసాట్ (2) రన్స్​ చేశారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్‌ మూడు వికెట్లు తీయగా.. నాట్ సీవర్‌, ఇస్సీ వాంగ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సైకా ఇషాక్‌ ఓ వికెట్ తీసింది.

ఇదీ చూడండి: టెన్నిస్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్​కు నిరాశ.. 18ఏళ్ల తర్వాత కెరీర్​లో తొలిసారి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.