ETV Bharat / sports

Ashes Test: మహిళల యాషెస్​ టెస్టు డ్రా

author img

By

Published : Jan 30, 2022, 2:11 PM IST

Women's Ashes Test: యాషెస్​ సిరీస్​లో భాగంగా మహిళా జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లాండ్​ ప్లేయర్​ హేథర్​ నైట్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

Women's Ashes Test
మహిళల యాషెస్​ టెస్టు డ్రా

Women's Ashes Test: మహిళల యాషెస్​ సిరీస్​లో భాగంగా జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. 257 పరుగుల లక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించినా ఇంగ్లాండ్​ ఆటగాళ్లు లక్ష్యం పూర్తి చేయలేకపోయారు. దీంతో మ్యాచ్​ డ్రా అయింది. ఆ జట్టు​ ప్లేయర్​ హేథర్​ నైట్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

తొలి ఇన్నింగ్స్​లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 337 పరుగులు వద్ద డిక్లేర్​ చేసింది ఆస్ట్రేలియా. లన్నింగ్స్​(93), ఆర్​ హైన్స్(86),​ తహ్లియా మెక్​గ్రత్​(52), గార్డ్నర్​(56) అద్భుత ఇన్నింగ్స్​ ఆడారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో కె బ్రంట్​ 5, ఎన్​ సీవర్​ 3, Shrubsole ఓ వికెట్​ తీశారు. ఇంగ్లాండ్​ తమ తొలి ఇన్నింగ్స్​లో 297 రన్స్​కు ఆలౌట్​ అయింది. హీధర్​ నైట్​(168*) సెంచరీతో అదరగొట్టింది. మిగతా వారు విఫలమయ్యారు.

దీంతో 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించినా ఆస్ట్రేలియా 216/7 వద్ద డిక్లేర్​ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్​ మొదలుపెట్టిన ఇంగ్లాండ్..​ తొమ్మిది వికెట్లు కోల్పోయి 245 రన్స్​ చేశారు. నటలీ సీవర్​(58), హీధర్​ నైట్​(48), లారెన్​ విన్​ఫీల్డ్​ హిల్(33), టమ్మీ బ్యూమౌంట్​(36), సోఫియా డంక్లీ(45) రాణించారు. ఆసీస్​ బౌలర్లలో అన్నాబెల్​ సదర్​ల్యాండ్​ 3, అలనా కింగ్​ 2 వికెట్లు దక్కించుకున్నారు.

ఫిబ్రవరి 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

హాట్​నెస్​తో చలిలోనూ చెమటలు పట్టిస్తోందిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.