ETV Bharat / sports

Varanasi Cricket Stadium : మోదీకి సచిన్, జై షా గిఫ్ట్స్​.. ఏమిచ్చారో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 6:31 PM IST

Updated : Sep 23, 2023, 7:09 PM IST

Varanasi Cricket Stadium
Varanasi Cricket Stadium

Varanasi Cricket Stadium : దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు.

Varanasi Cricket Stadium : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో.. కొత్త ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీసీసీఐ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.. మోదీకి భారత్ జెర్సీని అందజేశారు. ఒకటో నెంబర్​తో ఉన్న ఈ జెర్సీ వెనకాల 'నమో' అని రాసి ఉంది. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.. ప్రధానికి బ్యాట్​ జ్ఞాపికను అందజేశారు. ఇక అంతకుముందు సభలో.. " ఈరోజు వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం భగవాన్ శివుడికే అంకితం. ఇది స్థానిక యువతకు ఓ వరం. యావత్ ప్రపంచం క్రికెట్​ ద్వారా భారత్​తో కనెక్ట్ అయ్యింది" అని మోదీ అన్నారు.

Varanasi Cricket Stadium Design : ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్‌ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్‌ నిర్మించనున్నారు. సుమారు 30,000 సీటింగ్ సామర్థ్యం ఉండే ఈ స్టేడియాన్ని.. 121 ఎకరాల్లో రూ. .330 కోట్ల వ్యయంతో ఉత్తర్​ప్రదేశ్ సర్కార్ నిర్మించనునుంది. ఇక కాన్పుర్‌, లఖ్‌నవూ తర్వాత యూపీలో నిర్మిస్తున్న మూడో అంతర్జాతీయ స్టేడియం. దీని నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి పూర్తయ్యే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టేడియం నమూనా ఫొటోలు ఇప్పటికే బయటకొచ్చి.. క్రీడాప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. డిజైన్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఈ కార్యక్రమం అనంతరం భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని.. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు

PM Modi Varanasi Cricket Stadium : శివతత్వం ఉట్టిపడేలా కాశీ స్టేడియం.. 'మహాదేవ్​'కు అంకితం చేసిన మోదీ

Team India ODI Ranking 2023 : టీమ్​ఇండియా.. క్రికెట్‌ చరిత్రలోనే అరుదైన ఫీట్​.. నెం.1గా ఘనత

Last Updated :Sep 23, 2023, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.