ETV Bharat / sports

కెప్టెన్​గా రోహిత్​ చెత్త రికార్డ్​.. ఆ విషయంలో కోహ్లీనే బెస్ట్​!

author img

By

Published : Mar 20, 2023, 3:22 PM IST

Rohith kohli
కెప్టెన్​గా రోహిత్​ చెత్త రికార్డ్​.. ఆ విషయంలో కోహ్లీనే బెస్ట్​!

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ.. తన ఖాతాలో ఓ చెత్త రికార్డును వేసుకున్నాడు. ఈ రికార్డు విషయంలో ధోనీని అధిగమించాడు హిట్​ మ్యాన్​. ఆ వివరాలు..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్​ఇండియా ఘోర ఓటమిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు కేవలం 117 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్​ జట్టు ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండానే ఛేదించింది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ ఓటమితో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ పేలవ రికార్డు గతంలో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉండేది. అయితే ఇప్పుడా రికార్డునే హిట్​మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అదేంటంటే.. టీమ్​ఇండియా మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్​లలో ధోనీ ఒకడు. అతడి సారథ్యంలో భారత్‌ మూడు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడింది. వన్డే ప్రపంచ కప్‌, టీ20 వరల్డ్‌ కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో టీమ్​ఇండియా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ధోనీ వారసుడిగా జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించిన విరాట్‌ కోహ్లీ మాత్రం ఐసీసీ ట్రోఫీలను ముద్దాడలేకపోయాడు. కానీ టీమ్​ను ప్రపంచకప్​ క్రికెట్​లో బలంగా నిలిపాదడు. అలాగనే టెస్టుల్లో భారత జట్టును నెం.1 స్థానంలో నిలబెట్టాడు. ఇక కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకున్న విషయం తెలిసిందే. అయితే హిట్​మ్యాన్​ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్​గా కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నాడు. కెప్టెన్​గానూ ఓ రికార్డును మూటగట్టుకున్నాడు.

టీమ్​ఇండియా.. ధోనీ సారథ్యంలో 200 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండు సార్లు 150 కన్నా తక్కువ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. అయితే హిట్​మ్యాన్​ ఇప్పటి వరకు తన కెప్టెన్సీలో 25 వన్డేలకు సారథిగా ఉన్నాడు. అందులో ఏకంగా మూడు సార్లు భారత జట్టు 150 కన్నా తక్కువ స్కోరుకే కుప్పకూలింది. అలా ధోనీ తన సారథ్యంలో అందుకున్న చెత్త రికార్డును ఇప్పుడు రోహిత్‌ శర్మ కేవలం 25 మ్యాచ్‌ల్లోనే బ్రేక్‌ చేశాడు.

ఇక ఈ మ్యాచ్​ విషయానికొస్తే.. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ రెండో వన్డేలో పది వికెట్ల తేడాతో ఆసీస్​ గెలుపొంది.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆసీస్​ ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(66*), ట్రావిస్‌ హెడ్‌(51*) మ్యాచ్‌ను ముగించారు. మిచెల్‌ మార్ష్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ఏకంగా 6 ఫోర్లు, 6 సిక్స్‌లు బాదాడు. మూడో వన్డే విషయానికొస్తే.. మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్​లో ఏలాగైనా గెలిచి సిరీస్​ను దక్కించుకోవాలని అటు ఆసీస్​ జట్టు.. ఇటు రోహిత్ సేన పట్టుదలతో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇదీ చూడండి: అద్భుతం.. టెస్లా కార్ల లైట్లతో 'నాటు నాటు' షో.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.