ETV Bharat / sports

'ఆసీస్‌ క్రికెట్‌ మేనేజర్‌.. ఏదో ఒకటి చేయ్ బాస్‌.. లేకుంటే మీ జట్టు పొట్లమే'

author img

By

Published : Feb 25, 2023, 2:50 PM IST

Updated : Feb 25, 2023, 3:45 PM IST

టీమ్​ఇండియాపై గెలవాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఆసీస్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సూచించాడు. లేకపోతే నవ్వుల పాలుకాక తప్పదని సున్నితంగా హెచ్చరించాడు. ఇంకేమన్నాడంటే?

team india ex cricketer krishnamachari srikanth advice to australia coach
team india ex cricketer krishnamachari srikanth advice to australia coach

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​కు వచ్చిన ఆస్ట్రేలియా.. తొలి రెండు టెస్ట్​ మ్యాచుల్లో ఓటమిపాలైంది. టీమ్​ఇండియాను సొంతగడ్డపైనే ఓడించి సిరీస్​ తీసుకెళ్తామని చెప్పిన ఆసీస్.. కనీసం మిగిలిన రెండు టెస్టులను గెలిస్తేనే సిరీస్​ను సమం చేసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​లో టాప్​ ర్యాంక్​ పోనుంది. మరోవైపు, గాయాల రూపంతోపాటు వ్యక్తిగత పనుల నిమిత్తం ఆటగాళ్లు జట్టును వీడటం ఆసీస్‌ను దెబ్బ తీసేలా ఉంది. ఇప్పటికే కెప్టెన్​ ప్యాట్‌ కమిన్స్‌, స్టార్​ ఓపెనర్​ డేవిడ్‌ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యారు. దీంతో మూడో టెస్టు మ్యాచ్‌కు స్టీవ్‌స్మిత్ సారథ్యం వహించనున్నాడు.

ఈ నేపథ్యంలో టీమ్​ఇండియాపై గెలవాలంటే 'ప్రత్యేకంగా ఏదైనా చేయాలి' అని ఆసీస్‌కు టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సూచించాడు. లేకపోతే నవ్వుల పాలుకాక తప్పదని సున్నితంగా హెచ్చరించాడు. "ఇది ఆసీస్‌ క్రికెట్‌ మేనేజర్‌కు చెబుతున్నా.. భారత్‌పై గెలవాలంటే 'ఏదో ఒకటి చేయ్‌ బాస్‌'.. సిరీస్‌పై భారీ స్థాయిలో అంచనాలు ఉండేవి. నేను ఇంగ్లీష్‌లోనే చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఏదొకటి మీరు చేయాలి. లేకపోతే మీ జట్టు 'పొట్లం' అయిపోతుంది. ఇతర జట్ల ముందు నవ్వులపాలు కాక తప్పదు" అని క్రిష్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడాడు.

కాగా, మార్చి 1 నుంచి ఇందోర్​ వేదికగా భారత్ - ఆసీస్‌ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మన సొంతమవుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూసుకెళ్తుంది.

Last Updated : Feb 25, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.